హీరోయిన్ కు చెక్ పెట్టిన జనం

|| || || Leave a comments
హీరోయిన్ కు చెక్ పెట్టిన జనం "కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు" ఈమధ్య హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఇది. నిమిషాల్లో అది బ్యాక్ ఫైర్ కూడా అయింది. ఆ వెంటనే ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ, ఐశ్వర్య తన కామెంట్స్ ను కూడా కాస్త సవరించుకుంది. అయితే, ఆరోజు, ఈరోజు జనం మాత్రం ఐశ్వర్య రాజేష్ ను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. తాజాగా వాళ్లకు శృతి హరిహరన్ రూపంలో మరో అస్త్రం దొరికింది. కోలీవుడ్ లో తనకు కాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఐదుగురు నిర్మాతలు, కేవలం ఒకే సినిమా కోసం తనను కాంప్రమైజ్ అవ్వమన్నారంటూ ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్ ను బయటకు తీసి, ఐశ్వర్య రాజేష్ కు ట్యాగ్ చేస్తున్నారు చాలామంది. ఈ హీరోయిన్ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టకపోవచ్చు. సీనియర్ హీరో అర్జున్ పై కాస్టింగ్ కౌచ్ చేసిన హీరోయిన్ గా ఈమె చాలామంది గుర్తుపడతారు. అవును. అర్జున్ పై మీటూ వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ ఈవిడే. అప్పట్లో ఆ గొడవపై చాలా గందరగోళం చెలరేగింది. చివరికి కోర్టు వరకు వెళ్లింది వ్యవహారం. కోర్టు కేసును కొట్టేయడంతో, శృతి సైలెంట్ అయింది. ఎప్పుడైతే హేమ కమిటీ రిపోర్ట్ తెరపైకి వచ్చిందో, అప్పుడీమె మళ్లీ యాక్టివ్ అయింది. 2012లో విడుదలైన సినిమా కంపెనీ అనే మలయాళ చిత్రంతో హీరోయిన్ గా మారిన శృతికి, కోలీవుడ్ నుంచి ఆఫర్ వచ్చింది. ఆ సినిమాకు ఐదుగురు నిర్మాతలు. కాబట్టి ఐదుగురికీ సహకరించాలని, కాస్త సర్దుకొని కమిట్ మెంట్ ఇస్తే స్పాట్ లో చె