పోలీసుల కథనం ప్రకారం.. 53 ఏళ్ల మహిళ మధ్యాహ్నం 2.23 గంటలకు పితంపుర మెట్రో స్టేషన్లో రైలు ముందు దూకింది. స్థానికులు మెట్రో పోలీసులకు సమాచారం అందించారు.
తీవ్రంగా గాయపడిన మహిళను మెట్రో సిబ్బంది రోహిణిలోని బీఎస్ఏ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో మహిళ కుడి చేయి తెగిపోయింది. మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని అధికారి తెలిపారు.
ఈ విషయమై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో రెడ్లైన్లోని పితాంపుర మెట్రో స్టేషన్లో రైలు పట్టాలపైకి మహిళ దూకడం వల్ల 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యమైందని, ఆ తర్వాత మరోసారి మెట్రో సర్వీసును పునరుద్ధరించామని డీఎంఆర్సీ సీనియర్ అధికారి తెలిపారు.
అటువంటి మరికొన్ని అంశాలు