అందులో భాగంగా ఈ సంవత్సరం జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అందులో 8 ఇంచుల సైజులో 2.70 లక్షలు, ఒక ఫీట్ సైజులో 30 వేలు, ఒకటిన్నర ఫీట్ సైజులో 10 వేల. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొని మట్టి వినాయక ప్రతిమలను స్వీకరించారు.
GHMC: మట్టి గణపతులను పూజిద్దాం.. జీహెచ్ఎంసీ ద్వారా 3.10 లక్షల విగ్రహాల పంపిణీ
gopal || || || Leave a comments
గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జీహెచ్ఎంసీ ఉద్యోగులు, సిబ్బందికి మట్టి వినాయక విగ్రహాలను మేయర్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్ తరాలకు కాలుష్య రహిత వాతావరణం కల్పించడం, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. పర్యావరణం పట్ల ప్రజలను చైతన్య పర్చడంలో భాగంగా జీహెచ్ఎంసీ ద్వారా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు.